పలమనేరు జూలై 13 పలమనేరు నియోజకవర్గంబైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ దుమకురాళ్ళు జలపాతంలో ఉదృతంగా నీరు ప్రవాహం ప్రవహిస్తోంది. కర్ణాటక లో కురిసిన భారీ వర్షాలకు నీరు వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహం చూపరులకు ఎంతోగానో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన కైగల్ నీటిప్రవాహం ప్రాంతంనికి పోలీస్ అధికారులు నిషేధం విధించడంతో పర్యాటకులు లేక వెలవెలబోతుంది. గతంలో ఇక్కడ నీటి ప్రవాహం చూడడానికి, ప్రకృతి అందాలు వీక్షించడానికి అనేక మంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు. అయితే ఇక్కడ దట్టమైన అడవి, నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం వలన అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు ఇక్కడ నిషేధం విధించారు. ఇక్కడ ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు మన రాష్ట్రానికి ఉపయోగపడకుండా ప్రక్క రాష్ట్రామైన తమిళనాడుకు నీరు వృధాగా వెళుతుంది. ఇక్కడ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సుమారు వెయ్యి ఎకరాల భూములకు నీటిని చెరువులకు సరఫరా చేసే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించి నీటిని అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని జిల్లా, మండల ప్రజలు కోరుతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న కైగల్ జలపాతం
పలమనేరు జూలై 13 పలమనేరు నియోజకవర్గంబైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ దుమకురాళ్ళు జలపాతంలో ఉదృతంగా నీరు ప్రవాహం ప్రవహిస్తోంది. కర్ణాటక లో కురిసిన భారీ వర్షాలకు నీరు వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహం చూపరులకు ఎంతోగానో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన కైగల్ నీటిప్రవాహం ప్రాంతంనికి పోలీస్ అధికారులు నిషేధం విధించడంతో పర్యాటకులు లేక వెలవెలబోతుంది. గతంలో ఇక్కడ నీటి ప్రవాహం చూడడానికి, ప్రకృతి అందాలు వీక్షించడానికి అనేక మంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు. అయితే ఇక్కడ దట్టమైన అడవి, నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం వలన అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు ఇక్కడ నిషేధం విధించారు. ఇక్కడ ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు మన రాష్ట్రానికి ఉపయోగపడకుండా ప్రక్క రాష్ట్రామైన తమిళనాడుకు నీరు వృధాగా వెళుతుంది. ఇక్కడ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సుమారు వెయ్యి ఎకరాల భూములకు నీటిని చెరువులకు సరఫరా చేసే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించి నీటిని అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని జిల్లా, మండల ప్రజలు కోరుతున్నారు.

