శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి కోలా వైశాలికు ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు కోలా ఆనంద్ దంపతులను శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన శేషవస్త్రం కప్పి సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….. నూతన సంవత్సరమైన శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన ఉగాది నుంచి ప్రజల కష్టాలు తొలగిపోయి విజయవంతమైన మార్గంలో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కోలా వైశాలి మాట్లాడుతూ, శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలు అహంకారాన్ని, చెడు ఆలోచనలను పరాభవం చేసి ఆత్మపరిశీలనతో కొత్తగా ముందుకు సాగే సమయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటా నూతన ఆశలు చిగురించాలని కోరుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కార్యదర్శి కొండేటి గోపాల్, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కునాటి నాగరాజు, బీజేపీ నాయకులు జీవి అమర్నాథ్, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, ఆముదాల మునిరాజా, హుకీం సింగ్, చంద్రయ్య, కండాడు సుధాకర్, పరుకూరు మునిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఉగాది పర్వదినం సందర్భంగా కోలా ఆనంద్ దంపతులకు ఘన సన్మానం
శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి కోలా వైశాలికు ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు కోలా ఆనంద్ దంపతులను శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన శేషవస్త్రం కప్పి సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….. నూతన సంవత్సరమైన శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన ఉగాది నుంచి ప్రజల కష్టాలు తొలగిపోయి విజయవంతమైన మార్గంలో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కోలా వైశాలి మాట్లాడుతూ, శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలు అహంకారాన్ని, చెడు ఆలోచనలను పరాభవం చేసి ఆత్మపరిశీలనతో కొత్తగా ముందుకు సాగే సమయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటా నూతన ఆశలు చిగురించాలని కోరుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కార్యదర్శి కొండేటి గోపాల్, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కునాటి నాగరాజు, బీజేపీ నాయకులు జీవి అమర్నాథ్, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, ఆముదాల మునిరాజా, హుకీం సింగ్, చంద్రయ్య, కండాడు సుధాకర్, పరుకూరు మునిబాబు తదితరులు పాల్గొన్నారు.

