*ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
*విశాఖపట్టణం నవంబర్ పున్నమి ప్రతినిధి *:- గ్రామీణ మండలం చినగదిలిలో ఉన్న ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గోదాములను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా విజిటింగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.


