ముస్తాబాద్/ ఫిబ్రవరి /పున్నమి ప్రతినిధి
కలాంగులకు మరియు పెన్షన్ దారులకు నిరంతరం సేవలందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న వికలాంగుల జిల్లా కన్వీనర్ సడిమెల శోభారాణి గారు ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ పేరుతో అందించే ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకోవడం పట్ల ఈరోజు మండల దళిత బహుజన నాయకులు కలిసి ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల పరిరక్షణ, పెన్షన్ దారుల సమస్యల పరిష్కారం కోసం శోభారాణి గారు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు.
సడిమెల శోభారాణి గారు మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా వికలాంగులు మరియు పేద ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల దళిత బహుజన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


