అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 2 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఆమరావతి రాజధాని చట్టబద్ధతకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో జెండాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఆమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.


