శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదివారం నాడు తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కమిషనర్ దంపతులకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. కమిషనర్ కృష్ణతేజ కుటుంబ సభ్యులకు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, చైర్మన్ సాయి ప్రసాద్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడుతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్య నాయకులు కుమార్, జయప్రకాష్, మహేష్, చిరంజీవి, పగడాల ప్రతాప్, ఉప్పు కిష్టయ్య, ఢిల్లీ బాబు, లీలాధర్, మహిళా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక ప్రత్యేక కార్యక్రమంలో, జాతీయ స్థాయిలో ‘మహిళా సాధికారత’ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న బొక్కసంపాళెం గ్రామ సర్పంచ్ను కమిషనర్ కృష్ణతేజ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళా శక్తికి, అభివృద్ధికి ఈ జాతీయ అవార్డు ఒక గొప్ప గుర్తింపు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంపీడీవో, డీపీఆర్ఓ, ఇతర మండల అధికారులు పాల్గొని సర్పంచ్ను ప్రశంసించారు.

ఆధ్యాత్మికత..అధికారిక గుర్తింపు-శ్రీకాళహస్తిలో కమిషనర్ కృష్ణతేజ పర్యటన
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదివారం నాడు తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కమిషనర్ దంపతులకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. కమిషనర్ కృష్ణతేజ కుటుంబ సభ్యులకు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, చైర్మన్ సాయి ప్రసాద్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడుతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్య నాయకులు కుమార్, జయప్రకాష్, మహేష్, చిరంజీవి, పగడాల ప్రతాప్, ఉప్పు కిష్టయ్య, ఢిల్లీ బాబు, లీలాధర్, మహిళా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక ప్రత్యేక కార్యక్రమంలో, జాతీయ స్థాయిలో ‘మహిళా సాధికారత’ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న బొక్కసంపాళెం గ్రామ సర్పంచ్ను కమిషనర్ కృష్ణతేజ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళా శక్తికి, అభివృద్ధికి ఈ జాతీయ అవార్డు ఒక గొప్ప గుర్తింపు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంపీడీవో, డీపీఆర్ఓ, ఇతర మండల అధికారులు పాల్గొని సర్పంచ్ను ప్రశంసించారు.

