పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మచిలీపట్నం ఎంపీ బాలసౌరితో కలిసి పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా మన ఎంపీ బాలసౌరి అని, నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్న సి ఎస్ ఆర్ నిధులు మరియు ఎంపీ లాడ్స్ నుండి నిధులు మంజూరు చేసి అభివృద్ధికై ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.
అనంతరం ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ కృష్ణాజిల్లా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని కృష్ణా నది నుండి ఎనిమిది TMC ల వాటర్ ని తాగునీటికై ఉపయోగించుకునేలా సుమారు 6000 కోట్ల రూపాయలకు DPR తయారు చేశారని,మూడు వేల కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ కింద తీసుకువచ్చి మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాబార్డ్, ఏషియన్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ లాంటి ఏదో ఒక బ్యాంకుల నుండి తీసుకువచ్చి ప్రతి ఇంటికి పుష్కలంగా నీళ్లు తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి తో చర్చిస్తున్నామని వారు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన తెలియజేశారు
ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బండ్రెడ్డి రామకృష్ణ మరియు వివిధ కూటమి నాయకులు పాల్గొన్నారు.


