శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత పవిత్రమైన కైలాసగిరి ప్రదక్షిణం (కొండచుట్టు) కార్యక్రమం ఘనంగా జరిగినది. ముందుగా ఆలయం నుండి శ్రీ స్వామి, అమ్మవార్లు బయలుదేరి నాలుగు మాడ వీధుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదక్షిణ దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగి, తిరిగి ఆలయ గాలిగోపురం వద్ద భక్తిభావంతో ముగిసింది. ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ఈ గిరి ప్రదక్షణలో పాల్గొని నియోజకవర్గ ప్రజలందరి సంక్షేమం కోరుతూ ఆ వాయులింగేశ్వరుని కృపాకటాక్షాలు మన నియోజకవర్గ ప్రజలపై, రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అశేష భక్తజనం పాల్గొన్నారు.

శివపార్వతుల గిరి ప్రదక్షిణ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి రిషిత రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత పవిత్రమైన కైలాసగిరి ప్రదక్షిణం (కొండచుట్టు) కార్యక్రమం ఘనంగా జరిగినది. ముందుగా ఆలయం నుండి శ్రీ స్వామి, అమ్మవార్లు బయలుదేరి నాలుగు మాడ వీధుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదక్షిణ దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగి, తిరిగి ఆలయ గాలిగోపురం వద్ద భక్తిభావంతో ముగిసింది. ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ఈ గిరి ప్రదక్షణలో పాల్గొని నియోజకవర్గ ప్రజలందరి సంక్షేమం కోరుతూ ఆ వాయులింగేశ్వరుని కృపాకటాక్షాలు మన నియోజకవర్గ ప్రజలపై, రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అశేష భక్తజనం పాల్గొన్నారు.

