Tuesday, 7 April 2026
  • Home  
  • అడ్వకేట్ల సంక్షేమంపై దృష్టి – ఏపీ బార్ కౌన్సిల్ సత్తు అంకయ్య స్పష్టం
- తిరుపతి

అడ్వకేట్ల సంక్షేమంపై దృష్టి – ఏపీ బార్ కౌన్సిల్ సత్తు అంకయ్య స్పష్టం

శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని మంగళవారం నాడు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య సందర్శించారు. ఈ యనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరంభాకం ముని ప్రసాద్ నేతృత్వంలో న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సత్తు అంకయ్య మాట్లాడుతూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం, వెల్ఫేర్ ఫండ్ బలోపేతం, ఆరోగ్య బీమా, మరణానంతర లాభాలు, వాలంటరీ రిటైర్మెంట్ వంటి కీలక అంశాలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తనను ఎప్పుడైనా కలిసేందుకు అందుబాటులో ఉంటానని, న్యాయవాదులు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తనకు అఖండ విజయం అందించిన న్యాయవాదులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశం అనంతరం శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తు అంకయ్యకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని మంగళవారం నాడు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య సందర్శించారు. ఈ యనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరంభాకం ముని ప్రసాద్ నేతృత్వంలో న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సత్తు అంకయ్య మాట్లాడుతూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం, వెల్ఫేర్ ఫండ్ బలోపేతం, ఆరోగ్య బీమా, మరణానంతర లాభాలు, వాలంటరీ రిటైర్మెంట్ వంటి కీలక అంశాలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తనను ఎప్పుడైనా కలిసేందుకు అందుబాటులో ఉంటానని, న్యాయవాదులు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తనకు అఖండ విజయం అందించిన న్యాయవాదులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశం అనంతరం శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తు అంకయ్యకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.