అక్రమ రేషన్ బియ్యం గోదాం పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
07 ఏప్రిల్ 2026
పున్నమి న్యూస్ దినపత్రిక లో వచ్చిన అడ్రస్ల ఆధారంగా దాడులు
పున్నమి న్యూస్ దినపత్రిక, లలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా పై వస్తున్న వరుస కథలతో జిల్లా సివిల్ సప్లై అధికారులు స్పందించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం లు ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పున్నమి న్యూస్ దినపత్రికతో పాటు చానల్ లో మంగళపల్లి (బొంగులూరు) గేటు వద్ద భారీ అక్రమ రేషన్ బియ్యం గోదాం పై వచ్చిన కథనాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ షెడ్డు ని అద్దె కోసం ఇచ్చిన యజమాని కూడా ఈ అక్రమ రేషన్ బియ్యం దందా లో పార్ట్నర్ అని స్థానికులు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా పొంచి ఉందని దీనిపై వెంటనే అధికారులు దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పున్నమి న్యూస్ దినపత్రిక, లో వస్తున్న కథనాలపై ప్రజలు అభినందిస్తున్నారు.*




