*అక్రమ మట్టి రవాణా పై మౌనం పాటిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం*
*రాజకీయ నాయకుల అండ దండలతో యథేచ్ఛగా మట్టి మాఫియా ఆగడాలు.*
*రెవెన్యూ అధికారులుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం.*
*తమిళనాడు రాష్ర్టాలకు తరలి వెళ్లి పోతున్న ఎర్ర బంగారం.*
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం నెలవాయి గ్రామ పంచాయితీ లో ఉన్న మేత,ప్రభుత్వ, భూముల్లో ఉన్న ఎర్ర బంగార్రాన్ని కొందరి రాజకీయ నాయకులు అండదండలుతో యథేచ్ఛగా పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం.దీనిపై పలు మార్లు రెవెన్యూ అధికారులకు,పంచాయతీ అధికారులు కు,పోలీస్ శాఖ కు,జిల్లా అధికారులు కు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు కు దారితీస్తుందని,గ్రామస్థులు వాపోతున్నారు.అవినీతి అక్రమాలకు అడ్డాగా మారి ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి దోపిడీ దొంగలుతో చేతులు కలిపి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారిందని అందుకే వారిపై చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.ఇకనైనా నిద్ర మత్తును వీడి అక్రమ మట్టి తరలింపు పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే గ్రామస్థులు అందరం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు హెచ్చరించారు.ఇళ్లకు మట్టి తీసుకురావలంటే రెవెన్యూ సిబ్బంది అనుమతి అడిగే అధికారులు, లారీలు లారీలు పక్క రాష్ట్రాలు కు తరలిస్తుంటే ఆఫీసుల్లో నిద్రపోతే ఎలా సారు అంటూ వాపోతున్నారు.


