Tuesday, 3 March 2026
  • Home  
  • సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ
- తిరుపతి

సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 02, మహిళా శ్రేయస్సు సమాజ పురోగతి అని మహిళా సాధారితే అభివృద్ధికి అసలైన పునాది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు శాంతి దుర్గ అన్నారు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆర్. సూర్యనారాయణ పిలుపుమేరకు మార్చి 7 వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న భారీ సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను సోమవారం నాడు కాళహస్తిలోని తెలుగు గంగ డివిజన్ కార్యాలయం నందు ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాంతి దుర్గా మాట్లాడుతూ…. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర అత్యంత కీలకమని మహిళా ఉద్యోగుల సమస్యలు వారి హక్కులు సాదారికతపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తెలుగంగ కార్యాలయంలోని మహిళ ఉద్యోగస్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆనంతరం రాష్ట్ర కౌన్సిలర్ విజయలక్ష్మిని ఆహ్వానిస్తూ తెలుగు గంగ ఆఫీసులో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు సిబ్బందికి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. మహిళా సాధారికత విధానాలతో నిర్వహించనున్న ఈ సదస్సు ఉద్యోగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగలో పనిచేసే ఇంజనీరింగ్ మహిళలు, ఏపీజీఈఏ సెక్రెటరీ భాష ఉపాధ్యక్షులు గజలక్ష్మి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 02, మహిళా శ్రేయస్సు సమాజ పురోగతి అని మహిళా సాధారితే అభివృద్ధికి అసలైన పునాది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు శాంతి దుర్గ అన్నారు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆర్. సూర్యనారాయణ పిలుపుమేరకు మార్చి 7 వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న భారీ సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను సోమవారం నాడు కాళహస్తిలోని తెలుగు గంగ డివిజన్ కార్యాలయం నందు ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాంతి దుర్గా మాట్లాడుతూ…. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర అత్యంత కీలకమని మహిళా ఉద్యోగుల సమస్యలు వారి హక్కులు సాదారికతపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తెలుగంగ కార్యాలయంలోని మహిళ ఉద్యోగస్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆనంతరం రాష్ట్ర కౌన్సిలర్ విజయలక్ష్మిని ఆహ్వానిస్తూ తెలుగు గంగ ఆఫీసులో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు సిబ్బందికి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. మహిళా సాధారికత విధానాలతో నిర్వహించనున్న ఈ సదస్సు ఉద్యోగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగలో పనిచేసే ఇంజనీరింగ్ మహిళలు, ఏపీజీఈఏ సెక్రెటరీ భాష ఉపాధ్యక్షులు గజలక్ష్మి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.