పున్నమి ప్రతినిధి – షేక్ రసూల్ అహమద్ : తమ సేవాకార్యక్రమాల్లో భాగంగా గూడూరు డివిజన్ లోని చిల్లకూరు మండలానికి చెందిన శారదానగర్ లోని పేద ప్రజలకు H2H (హార్ట్ టూ హాండ్) ఫౌండేషన్ అధ్యక్షుడు వాకా నిరంజన్ కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తాము నిరవధికంగా పేదప్రజలకు అవసరమైన ఆహార వస్తువులను అందిస్తున్నామని అందులో భాగంగా నేడు చిల్లకూరు మండలంలో కూరగాయలు తదితర వస్తువులను పంపిణి చేశామని చెప్పారు. తనకు ఎల్లప్పుడూ సహాయకారాలు అందించే తమ సంస్థ సభ్యులు అయిన వరప్రసాద్, ప్రభాకర్, కార్తిక్, రమేష్ లకు ఈ సందర్భంగా నిరంజన్ కృతఙ్ఞతలు చెప్పారు.