0
125

అనంతసాగరం మండలం: *లింగంగుంట* గ్రామంలో *డాllవై.ఎస్.ఆర్ పొలంబడి* కార్యక్రమాన్ని *అగ్రికల్చర్ అసిస్టెంట్ వడ్లపల్లి నాగేంద్ర* ఏర్పాటు చేయడం జరిగింది. పరిసరాల విశ్లేషణలో భాగంగా గింజ గట్టిపడే దశలో కేళీలు ఉన్నాయేమో గమనించి వాటిని పెరికించి వేయాలని, *వెన్ను దశలో తాలు గింజలు ఎన్ని వున్నాయో లెక్కించి దిగుబడి అంచనా ఎలా వేయాలో తెలియజేయడం జరిగింది.* రైతులు పండించే పంటలపై వారికి అవగాహనా కల్పిస్తూ, వారికీ తెలియని విషయాలు తెలియజేస్తూ, *పొలంబడి రైతులకు క్విజ్ పోటీలను* పెట్టి రైతులకు మరింత జ్ఞానాన్ని పెంపొందించడం జరిగింది. ఈకార్యక్రమంలో.. పొలంబడి రైతులు మరియు *హరీష్ ,హాసేన్ సౌజన్య, ప్రసన్న వెంకటేష్ వాలెంటీర్స్* పాల్గొనడం జరిగింది.