వాకర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి
నెల్లూరు, అక్టోబర్ 2 (పున్నమి విలేకరి) : 150వ గాంధీ జయంతి వేడుకలను చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహణ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిట్రపటానికి వాకర్స్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్ మోహన్స్ డయాబెటీస్సెంటర్ వారి చే ఉచిత షుగర్..బి.పి.పరీక్ష లను 250మందికి నిర్వహించారు.పినాకినీ లయన్స్ క్లబ్ వారి సహకారం తో 15మందిపార్క్ ఉద్యోగస్తులకు వస్త్రాలు పంపిణీ చేసారు. ఈకార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి సింగంసెట్టి మురళీ మొహాన రావు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని స్వతంత్రం సాధించిన మహనీయుడు గాంధీ గారని వారి ఆసయాలకు ఊపిరి పొయవలసిన భాద్యత మన అందరిది అని అన్నారు. ఈ కార్యక్రమం లో సింగంసెట్టి మురళీ మోహన్ రావు..కొట్టే రామమూర్తి..పాముల రమనయ్య ..లయన్ కిషోర్ కుమార్..గవర్నర్ కిషోర్ కుమార్..లీలారెద్ది..సగిలి జయరాం రెడ్డీ. కె. పెంచల నాయుడు. ఎల్. బాబు మరియు వాకర్స్ పాల్గొన్నారు.