రోబోతో కరోనా సేవలు

0
123

పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని మొరం గ్రామం చెందిన యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ చాలా ప్రయోగాలు చేసాడు. తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. దేశ వ్యాప్తంగా కరోన వైరస్ అలాడుతున్నదన్నారు కరోన రోగులకు సేవలు అందించేందుకు అందరూ భయపడుతున్నారు.కరోన రోగులకు వైద్యం చేయడానికి, వారికి మందులు ఇవ్వడానికి వైద్యులు ఇక భయపడవలసిన పనిలేదని శాస్త్రవేత్త పవన్ కుమార్ అంటున్నారు ఇందుకోసం తాను ఒక రూపం తయారు చేసినట్లు తెలిపారు తయారు చేసిన రోబో ను పలమనేరు పట్టణంలోని ఈమాస్ లెప్రసీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా పని చేయించారు.కారోనా సోకిన రోగులు దగ్గరికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లి పని ఉండదన్నారు . అందులోని ప్రోగ్రాం ప్రకారం రోబోనే నేరుగా వెళ్లి మందులు అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా నిర్ణిత దూరం నుంచి రోగికి అవసరమైన వాటిని అందించి ఫోటో తీసుకుందని తెలిపారు. కరోనా రోగికి చికిత్స సమయంలో మందులు, భోజనం రిమోట్ ద్వారా రోబో చేతులతో అందించే ఏర్పాటు చేసుకోవచ్చున్నారు.త్వరలో ఒక రోబోను తిరుపతి రుయా ఆస్పత్రికి ఇవ్వాలనుకుంటున్నాను అని ఆయన తెలిపారు.

0
0