కొత్తపేట జనవరి 30 (పున్నమి విలేఖరి): తూర్పుగోదావరిజిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆవిడి గ్రామ పంచాయతీ పరిధిలోని డాం సెంటర్ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న అవిడి గ్రామానికి చెందిన చప్పిడి గోపి వయస్సు సుమారు 50 సంవత్సరాలు వెనుక నుండి వస్తున్న ట్రాక్టర్ (ఏపీ 05 డి ఎం1306) నెంబరు గల వాహనము ఢీ కొనడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందడం జరిగింది. పోలీసు వారు కేసు దర్యాప్తు చేసి అంబులెన్స్ సహాయంతో ఆ మృతదేహాన్ని పోస్టు మార్టన్ నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.