పలమనేరు, జులై5 2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణానికి చెందిన టూవీలర్ మెకానిక్ ఫారుక్ గత ఇరవై రోజుల క్రితం టూ వీలర్ లో రోడ్డు ప్రమాదంలో కుప్పం మెడికల్ హాస్పిటల్ లో చికిత్స చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి మెకానిక్ ఫారుక్ అతని గ్యారేజ్ తీయ లేని స్థితిలో ఉండడం వలన పలమనేరు టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ ఫారుక్ కి పదివేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో టూ వీలర్స్ కార్మికులు ఒక లక్షకు పైగా ఉన్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రభుత్వము టూ వీలర్స్ కార్మికులకు ఎటువంటి సహాయాలు చెయ్యలేదని, గ్యారేజ్ లకు బాడుగ కట్టలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి అద్దెలు కూడా కట్టలేక పోతున్నామరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టూ వీలర్స్ వర్కర్స్ కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గణపతి, అక్బర్,సుబ్రహ్మణ్యం, దిన, నజీర్, హమద్ తదితరులు పాల్గొన్నారు.