మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో 300కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ..

    0
    197

    31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో షుమారు 300కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే త్రాగు నీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటరమణ దాతగా వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, ఏకొల్లు శ్రీనివాసులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు