లాక్డౌన్ సమయంలో పేదలకు నేను చేసిన సహాయమును గుర్తించి *విశ్వగురు వరల్డ్ రికార్డ్స్* వారు అచ్చంపేట కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మండికారి బాలాజీ గారికి *కరోనా వారియర్* అవార్డును అందజేసిన సందర్భంగా *మిత్రమండలి సేవాసంస్థ* ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న మండికారి బాలాజీ గారికి ఈ అవార్డును అందజేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత రాం బాబు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాణాల హరీష్ కుమార్ , గంగాపురం శ్రీనివాస్, పోల సాయిబాబు , చంద్రమోహన్ ,భీరం నరేందర్ రెడ్డి, పోల అశోక్ , ఆకుతోట కాశీలింగం,శ్రీమతి కేతరాజు కమల రాణి , శ్రీమతి ఉమాదేవి , శ్రీమతి పెద్ది మాధవి , బాలమని , గార్లపాటి శ్రీనివాస్, శ్యామ్ సుందర్ ,మేడిశెట్టి రమేష్ ,ఫుల్జాల శ్రీనివాస్ ,శ్రీధర్ శర్మ,నారాయణలు పాల్గొన్నారు.