బ్రిటిష్ ప్రభుత్వాలు భారతదేశంలో కలరా వ్యాప్తిని ఎలానిర్వహించాయి

0
196

పున్నమి ప్రతినిధి – షేక్ రసూల్ అహమద్ : ప్రతి 100 సంవత్సరాలకు ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం  చేసేయడం అనాదిగా వస్తున్నదే. ఇందులో ఒకటి కలరా వ్యాధి ఒకటి . ఈ వ్యాధివల్ల లక్షలమంది మృత్యువాత పడ్డారు.  ఇప్పటికి  ఆఫ్రికా ఖండ ప్రాంతాలలోని ప్రజలు అప్పుడప్పుడు దీని బారిన పడుతున్నారు. కలరాను, బ్లూ డెత్ అనికూడాపిలుస్తారు, ఎందుకంటే  వ్యక్తిపూర్తిగా ద్రవాలను కోల్పోయి చర్మం సహజ రంగునుండి నీలం-బూడిద రంగులోకిమారుతుంది, దీంతో ప్రతి సంవత్సరందాదాపు లక్ష మరణాలకు కలరాకారణమైంది. గత 250 సంవత్సరాల్లో, 6 సార్లు కలరా మహమ్మారిలో లక్షలాదిమంది మరణించారు. నేడు కలరా మహమ్మారియుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యాలువంటి విపత్తులతో సమానంగా పరిగణించబడుతుంది. విబ్రియోకలరా అనే బ్యాక్టీరియా వల్లకలరా వస్తుంది, ఇది సాధారణంగా మలపదార్థం ద్వారా వ్యాపిస్తుంది. చాలా మంది ప్రజలకుఎటువంటి లక్షణా కనిపించవు. దీంతో ఈ వ్యాధినివీరు సులభంగా కారీ చేస్తుంటారు. కొంతమందితెలియక అతిసారం యొక్క తీవ్రమైన కేసులనుఇంకాస్త ఎక్కువ చేస్తుంటారు. వ్యక్తులలోఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. చికిత్స చేయకపోతే, నీరు లేకపోవడం వల్లఒక వ్యక్తి గంటల్లోనే చనిపోవచ్చు. ఈ వ్యాధి శతాబ్దాలుగాగంగా మైదానంలో ఉంది,  బ్రిటిష్వలసరాజ్యాన్ని అనుసరించి వేగవంతమైన పట్టణీకరణ మరియు వాణిజ్యం ఈమహమ్మారికి అనువైన పరిస్థితులను సృష్టించింది. విపరీతమైన రద్దీ మరియు పారిశ్రామికీకరణ,పేలవమైన పారిశుధ్య పరిస్థితులు సైతం దీనికి కారణమైంది. కలరా వ్యాప్తి చరిత్రలోచాలాసార్లు జరిగి ఉండవచ్చు, వలసరాజ్యాలప్రభుత్వం యొక్క వాణిజ్యం మరియుయుద్ధ పిపాసం వలన కలరా ప్రపంచవ్యాప్తంగావ్యాపించింది. 1810 లో మొదటగా బ్రిటిష్దళాలు ఈ వ్యాధిని వివిధదేశాలకు తీసుకువెళ్ళాయి. తర్వాత ప్రతి ఇరవై సంవత్సరాలకుఒకసారి కలరా విస్ఫోటనం జరుగుతూవచ్చింది.బ్రిటిష్ వారి పుణ్యమాఅని 1810 లోనేఇండోనేషియా నుండి చైనా వరకు,అక్కడనుండి దక్షిణ ఆసియా అంతటా వ్యాపించింది.1830లో యూరప్ కు, అమెరికాకు1850 లో అడుగుపెట్టి  లాటిన్అమెరికా అంతటా వ్యాపించింది. 1860 లో మధ్యప్రాచ్యంగుండా ఆఫ్రికాకు  వెళ్ళింది.ఇలా ప్రపంచమంతా పాకిపోయి బ్రిటిషువారిని అప్రతిష్టపాలు చేసింది. కలరా వల్ల కలిగేనష్టాలను తగ్గించడానికి , బ్రిటిష్ వారు ప్రజారోగ్యం మరియుపారిశుద్ధ్యం యొక్క వ్యవస్థలను అభివృద్ధిచేశారు.నీటిని  పైపులద్వారా భవనాలనుంచి  త్వరగాబయటికి తరలించే విధంగా నగరాలు రూపకల్పన చేయడం ప్రారంభించారు.పారిశుద్ధ్యవ్యవస్థలు మొదట్లో కేవలం ప్రజల కోసమేవ్యర్థాలను తరలించడం జరిగేది. కాని ఇది ప్రజలందరికోసం  కాకుండాకొందరు ధనవంతుల కోసమే ఉపయోగపడేది. దిగువతరగతి ప్రజలు బాధింపబడేవారు. పైపుల గుండా వచ్చేవ్యర్ధాలు, మురుగునీళ్లను చాలా దూరం తరలించడానికి,మాన్యువల్ స్కావెంజర్లను ఉపయోగించేవారు. వీరు సాంద్రీకృత మలినంలోపని చేయాల్సి రావడంతో వారి పని మరింతప్రమాదకరంగా మారి వారు అనారోగ్యాలబారిన పడాల్సివచ్చింది. దీనితోపాటు నిఘా మరియు సామాజికదూర నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయికాని పెద్దగా విజయవంతం కాలేదు. రాజకీయ సమీకరణల కోసం కొందరు నాయకులు  తీర్థయాత్రలనుఅక్కడి జనసమూహాలను వాడుకొనేవారు. ఈ స్థలాలు సభలుగావాడటం బ్రిటిషువారిని సందిగ్ధంలోకి నెట్టివేశాయి. తీర్ధయాత్రలుచేయడం భారతదేశంలో సహజమైన ప్రక్రియ అటువంటి సందర్భంలో ప్రజలు వ్యాధులకు గురయ్యేవారు. ఆప్పట్లో యాత్రికుల ప్రయాణాన్ని నియంత్రించే చట్టాలు అంతగా లేవు. బ్రిటీష్ప్రభుత్వం యాత్రికుల స్థలాలను పరిశీలించి, రాజకీయ సమీకరణలపై అణిచివేసే విధంగా చర్యలు తీసుకొంది. అయితే ఇది కలరావ్యాప్తిని నిరోధించడానికి పెద్దగా ఉపయోగపడలేదు.. బ్రిటీష్ వారు కూడా కుంబ్లామేళా అనే భారీ తీర్థయాత్రలనుజరిపి తమ క్రూరమైన విధానాలుఐన డివైడ్ అండ్ పాలసీలను  సమర్థించుకోగలిగారు. కలరా చరిత్ర భారతదేశప్రజారోగ్య చరిత్రతో ముడిపడి ఉంది. వాణిజ్యం మరియువేగవంతమైన పారిశ్రామికీకరణ కలరా వ్యాప్తికి కారణంఅయితే, ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుద్ధ్య వ్యవస్థలనుఅభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. పనిలోపని నిఘా వ్యవస్థలను పెట్టిపరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాయిప్రభుత్వాలుఅవలంబించిన చర్యలు అందరినీ సమానంగా రక్షించలేదు, ప్రపంచవ్యాప్తంగా పేదలు, కార్మికవర్గం రక్షించబడలేదు. భారతదేశంలో, కుల అసమానతలతో, కొన్నివర్గాలు ఎక్కువ ప్రమాదంలోకి నెట్టబడ్డాయి. పాత వలస రాజ్య పాలనను గుర్తు చేస్తూ ఇటీవల మరొక మహమ్మారినుండి ప్రజలను రక్షించడమే లక్ష్యంగా పబ్లిక్ లాక్డౌన్ విధించబడింది. ఇందులో ఎవరు రక్షించబడ్డారు? ఎవరుప్రమాదంలోకి ఇరుకొన్నారు?

0
0