
దర్శి, మే31, 2020(పున్నమి విలేఖరి): దర్శి పట్టణంలో మాజీ మంత్రివర్యులు శ్రీ శిద్దా రాఘవరావు, వారి శ్రీ మతి శిద్దా లక్ష్మీ పద్మావతి పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం ఉదయం దరిశి కురిచేడు రోడ్డు లోని శ్రీ షిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమం లోని వృద్ధులకు టిఫిన్, చీరలు, పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వారి ప్రతినిధి మండాది సుబ్బారావు, వారి శ్రీ మతి మండాది జ్యోతి, వారి కుమారుడు మండాది లోకేష్, కుమార్తె వైష్ణవి మరియు బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు పాల్గొన్నారు.