పలమనేరు, జులై5(పున్నిమి విలేకరి):చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి జగమర్ల క్రాస్ వద్ద ఇటుకల లోడ్డుతో వెల్లుతున్నా ట్రాక్టర్ ను బోలేరో వాహనం ఢీ కొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు.మృతుడు పరదేసి బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద గ్రామం చెందిన వాడుగా గుర్తించారు. సంఘటన స్థలానికి 108 చేరుకునే లోపే అతను మృతిచెందారు. కారు డ్రైవర్ పరారి అయినడుని స్థానికులు సమాచారం.ఏస్ఐ నాగరాజు తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని మృతిని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏస్ఐ తెలిపారు.