Tuesday, 24 March 2026
  • Home  
  • ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
- Featured - తెలంగాణ

ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మంలో జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు ఖమ్మం ప్రతినిధి – పువ్వాడ నాగేంద్ర కుమార్ ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ బారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల జూన్ 3 నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మండలంలో ఈ సదస్సులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి రావాల్సిన ఫిర్యాదులను స్వీకరించి, పారదర్శకంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సదస్సుల ద్వారా భూ హక్కుల సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, రెవెన్యూ రికార్డుల సరిచూసే విషయాలు మొదలైనవి చర్చించనున్నాయి. ప్రజలు తమ సమస్యలపై సదస్సుల్లో నేరుగా హాజరై విన్నవించుకోవాలని, ప్రభుత్వం వారి పక్షాన ఉంది అని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ చర్యల ద్వారా ప్రజలకు న్యాయం చేయడం, ప్రజా విశ్వాసం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మంలో జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు

ఖమ్మం ప్రతినిధి – పువ్వాడ నాగేంద్ర కుమార్

ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ బారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల జూన్ 3 నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మండలంలో ఈ సదస్సులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజల నుంచి రావాల్సిన ఫిర్యాదులను స్వీకరించి, పారదర్శకంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సదస్సుల ద్వారా భూ హక్కుల సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, రెవెన్యూ రికార్డుల సరిచూసే విషయాలు మొదలైనవి చర్చించనున్నాయి. ప్రజలు తమ సమస్యలపై సదస్సుల్లో నేరుగా హాజరై విన్నవించుకోవాలని, ప్రభుత్వం వారి పక్షాన ఉంది అని అదనపు కలెక్టర్ అన్నారు.

ఈ చర్యల ద్వారా ప్రజలకు న్యాయం చేయడం, ప్రజా విశ్వాసం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.