Wednesday, 16 September 2026

Tag: DevelopedIndia

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వికసిత భారత్‌కు యువతే బలం

నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్–2047’ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.బి. రవికుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజయభారతి విద్యార్థులకు మానవ హక్కులు, రాజ్యాంగ బాధ్యతలపై అవగాహన కల్పించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని, కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణవేణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దోర్నాధుల వెంకటేశ్వర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.