అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో కూనంనేని దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం జనవరి పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ సెంటర్లో కూనంనేని సాంబశివరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. నిన్న అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, టి. భద్రం, గుత్త వెంకటేశ్వర్లు, రాజేష్ గుప్తా, సుదర్శన్ మిశ్రా, మణి, రవి రాదోడ్, బెనర్జీ, రుద్ర గాని మాధవ్, రామకృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.









