Sunday, 24 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించండి – గౌతమ్ రెడ్డిని కలిసిన యువనేత. డా. ధర్మాన కృష్ణ చైతన్య

నరసన్నపేట, జూన్ 5:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రితో చర్చించారు. ఏళ్ల తరబడి వలసలు పోతున్న వారికి చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా కారణంగా  చాలా మంది వెనక్కి వస్తున్నారని, వారికి ఉపాధి కరువై ఆందోళనలో ఉన్నారని చెప్పారు. దీనికి పర్యావరణ హితమైన  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ఒక్కటే మార్గమని చెప్పారు. జిల్లాలోనూ ప్రత్యేకించి నరసన్నపేట నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, భూమి, నీటి లభ్యతకు ఇబ్బంది లేదని ప్రధాన జాతీయ రహదారి,  రైల్వే మార్గం ఉండటం కలిసి వచ్చే అంశాలు అని చెప్పారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ ( సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ) ల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకం ఎంతో మేలు చేసిందని కృష్ణ చైతన్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

*ఏనుగు కేసులో పురోగతి:కేరళ సీఎం*

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది.దీనికి బాద్యులుగా భవిస్తూ ముగ్గురు అనుమనితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకొంది.వారిని విచారిస్తున్నామని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ CM పినరయి విజయన్ తెలిపారు. పోలీస్ శాఖ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం

చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గం లోని తవణంపల్లి మండలం ఎగువ మత్యం గ్రామంలోని నవీన్ కుమార్ రెడ్డి కుమారుడు హావిష్ రెడ్డి( 5) వైద్యం కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేస్తున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు,

Featured

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపుతానని బెదిరిస్తున్నాడు.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని కాగులపాడు గ్రామంలోని జె.అనిత అనే ఒక వివాహిత తన భర్త సుకుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒకే గ్రామానికి చెందిన సుకుమార్ అనితకు 2013లో ఒకరికొకరు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుకుమార్ తల్లిదండ్రులు ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. ఈ నేపధ్యంలో అనిత వాళ్ళ ఇంటికి వెళ్లారు. కానీ వెళ్లిన రోజు నుండి సుకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తమను ఐదు లక్షలు కట్నం తీసుకురమ్మని తరచూ వేధించేవాడని బాదితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఇరువురు పోలీసు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ కేసులు కోర్టులో నడుస్తూ ఉన్న నేపథ్యంలో సుకుమార్ మళ్లీ తన దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నీ దగ్గర ఉండడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదని అన్నాడని, అప్పటి నుండి మాఇంటికి వచ్చి వెళ్ళేవాడని బాధితురాలు చెప్పడం జరిగింది. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు బాధితురాలు గర్భవతి కావడంతో సుకుమార్ నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడని, అంతేకాకుండా నన్ను నా కడుపులోని బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడు అని బాధితురాలు వాపోతుంది. సుకుమార్ తనకు రాజకీయ పలుకుబడి ఉండడంతో నన్ను చంపుతాడని భయంగా ఉంది. కాబట్టి పోలీసు వారు నాకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నానని బాధితురాలు అన్నారు.

Featured

మీ – సేవలు ఇకపై సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి- జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నరసింహారావు, త‌హ‌సీల్దార్‌ షఫీ మాలిక్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వారికి అవగాహన కల్పించారు. గతములో మీ -సేవ ద్వారా అందించే అన్ని రకాల సేవలను ఇకపై సచివాలయంలోనే ప్రజలకు అందించనున్నామని ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఆన్ లైన్‌ సేవలను అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కళ్యాణి, ఈవోపీఆర్డీ పెంచల శ్యామ్ పాల్గొన్నారు.

Featured

బుచ్చిరెడ్డిపాలెం లోని ఇస్కపాలెం గ్రామ పంచాయతీలో వై ఎస్ ఆర్ హౌసింగ్ స్కీమ్ ధరకాస్తుదారురుల వెరిఫికేషన్.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామపంచాయతీ బిట్ 1 లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ 2020 ద్వారా రెండో విడత దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు వివరాల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం తమ సొంత ఇల్లు నిర్మించలేని రాష్ట్రంలోని పేద ప్రజలకు గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జూలై 12, 2019 న వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ 2020 ను ప్రారంభించారు. ఈ పథకం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రధాన 9 వాగ్దానాల్లో ఒకటి. ఈ పథకానికి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టారు. ఈ పథకాన్ని అంతకు ముందు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గా వ్యవహరించేవారు.YSR హౌసింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక బలహీన విభాగం వర్గం పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వ చొరవ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లబ్ధిదారులకు పక్కా గృహాన్ని అందించబోతోంది, దీని కోసం రాష్ట్ర బడ్జెట్ కింద రూ.1280 కోట్లు కేటాయించారు.ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి రాష్ట్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఈ గృహ పథకం ముఖ్యంగా రాష్ట్రంలోని EWS/MIG/LIG వర్గం ప్రజలకు. ఈ కార్యక్రమంలో ఇస్కపాలెం బిట్ 1 వి ఆర్ ఓ శ్రీనివాసులురెడ్డి, వి ఆర్ ఏ లు రమణయ్య, యాదగిరి, ఆ ఏరియా వాలేంటర్ బబ్లూ పాల్గొన్నారు.

Featured

నాడు-నేడు పనులు సకాలం లో పూర్తి చేయాలి

04-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పథకంలో భాగంగా మొదటి ఫేస్ లో జరుగుతున్న పనులను డిప్యూటీ డి.ఈ రాధాకృష్ణ పరిశీలించారు .ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలం లో నాడు-నేడు ఫస్ట్ ఫేస్ కి సంబంధించి 20 స్కూల్స్ ని ఎంపిక చేయడం జరిగిందని వీటి పనులకు సంబంధించి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల తొంబై ఒక్క రూపాయలు మంజూరు అయినవి అని తెలిపారు . మొత్తంపదహారు స్కూల్ లలో ప్రహరీ గోడనిర్మించవలసివున్నదని తెలిపారు .మొత్తం తొమ్మిది రకాలపనులుచేయవలసిఉందన్నారు .పెయింటింగ్ ,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ ,శానిటేషన్,మేజర్ అండ్ మైనర్ వర్క్ , మినరల్ వాటర్ స్కూల్ కి అవసరమైన టేబుల్స్ మొదలైనవన్నీ జూలై 31 కి పూర్తి చేయవలసిందిగా ఆదేశించామన్నారు ఆగస్టు మూడు కి స్కూల్స్ ప్రారంభించే టప్పటికీ అన్ని వసతులతోతీర్చిదిద్దుతామని తెలియజేశారు .మనుబోలు లోని చంద్రమౌళినగర్ నందు మరియు బద్దవోలు, వెంకన్నపాలెం నందు గల స్కూల్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,నాడు నేడు మనుబోలు ఏ.ఇ సుబ్బరాయలు, జడ్పీ బాయ్స్ హెడ్ మాస్టర్ ఎం.రమేష్ కుమార్ ,జడ్పీ గర్ల్స్ హెడ్మాస్టర్ జె.పద్మజ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* 

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి *262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.   స్వంత వాహనం కలిగిన.ఆటో. టాక్సీ.మ్యాక్సీ క్యాబ్. డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లోఈ రోజు జమ కానుంది   గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా. *37,756* మంది లబ్ధిదారులజాబితాలోచేరారు. కాగా ఈపధకం కింద ప్రతి ఏటా రూ. పది వేలుఇవ్వనున్నారు.

ప్రకాశం

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వాహనమిత్ర లబ్ధిదారులు

దర్శి, జూన్ 4, 2020(పున్నమి విలేఖరి):  మల్లవరం గ్రామంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎంఎల్ఎ కుందురు నాగార్జున రెడ్డి పాలాభిషేకం నిర్వహించిన వైస్సార్ వాహనమిత్ర పథకం లబ్ధిదారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా పనుల్లేక, క్యాబ్‌లు తిప్పేందుకు వీల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిన ఈరోజుల్లో, ఎవరూ అడగకుండానే ఈ ఏడాదికి గాను నాలుగు నెలలు ముందుగానే వైస్సార్ వాహన మిత్ర పధకం కింద రూ.10 వేల సాయం అందించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. లబ్ధిదారుల్లో అత్యధికులు బిసిలే అని తెలియచేసారు. ఈ సంవత్సరం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేలు చొప్పున జమ చేయబోతున్నారు అన్నారు.  మొత్తం లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,592 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 మంది బ్రాహ్మణులు, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు. అడగకుండానే ఆదుకుంటున్నారు. కరోనా కారణంగా పనుల్లేక, ఆటోలు తిప్పలేక అనేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మేం అడగకుండానే నాలుగు నెలలు ముందుగానే రూ.10 వేల సాయం అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. గతేడాది అందించిన ఆర్థిక సాయంతో వాహనాలకు బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులు చేయించుకున్నాం. తాళ్లూరి యోహాను, ఆటోడ్రైవర్, మల్లవరం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి, వైస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులు, చిన్నబ్బయ్య, మాజీ ఎంపీపీ వై వెంకటేశ్వర్లు, ఆర్. శ్రీను, ఆర్. హనుమంతరావు, ఆర్. నరసింహారావు, యేసురావు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Featured

వాకాటి స్వగ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణి

తడ మండలం చేనిగుంట గ్రామంలో BJP పార్టీకి చెందిన జిల్లాMLC వాకాటి నారయణరెడ్డి ఆయన సొంత స్వగ్రామమైన చేనిగుంటలో ఆయన సొంత నిధులతో సుమారు 10లక్షల రూపాయలతో నిత్యవసర సరుకులు పంపిణి చేసారు. గ్రామంలో ఒక్కో కుటుంబానికి 20kg బియ్యం, 1 kg నూనె,1 kg కందిపప్పు,1kg పెసలపప్పు, 1kg ఉల్లిపాయలు, ఆడవారికి చీర,మగవాళ్ళకు పంచెలు 450 మంది కుటుంబాలకు పంచి పెట్టారు.. కార్యక్రమంలో BJP తిరుపతి పార్లమెంట్ అద్యక్షుడు దయకర్ రెడ్డి గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ BJPపార్టీ కన్వీనర్ క్రిష్ణమూర్తి, గ్రామస్థులు పాల్గొన్నారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.