Sunday, 24 May 2026

Blog

Featured

పేకాట రాయళ్లు అరెస్టు

పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి):పలమనేరు నియోజవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని మిట్టపల్లి అటవీ సరిహద్దులో జూదం ఆడుతున్నరని పక్క సమాచారం రావడంతో రంగంలోకి దిగిని స్థానిక యస్.ఐ మునుస్వామి మరియు పోలీస్ సిబ్బంది.13 మందిని అరెస్ట్ చేసి,వారి వద్ద లక్ష తొంబై మూడు వేలు రూపాయిలు స్వాధీనం చెసుకొనట్టు స్థానిక యస్.ఐ తెలిపారు.వీరిలో నలుగురు కర్ణాటక వాసులు మంజునాథ్, హసిప్ ఖాన్,ప్రశాంత్ కుమార్,రవిప్రసాద్,గా గుర్తించారు.మిగతవారు పలమనేరు నియెజకవర్గ వాసులు ధనుంజయ్,వేణుగోపాల్, వెంకటరమణారెడ్డి,లింగప్ప,రామకృష్ణ,సుబ్రమణ్యం, నారాయణస్వామి, గురునాథ్ గా గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యస్.ఐ మునుస్వామి,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Featured

నాటు బాంబు కొరికిన ఆవు చిద్రమైన నోరు

పలమనేరు ,జూన్29,2020(పున్నమి విలేకరి): నాడు కేరళలో ఏనుగు.. నిన్ను తెలంగాణలో కోతి.. నేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గం లో ఆవు . ఇలా వరుసగా మూగజీవాల పై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…పలమనేరు నియోజవర్గం పెద్దపంజాణి మండలం కొగిలేరు గ్రామ సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తుంది. పీఠానికి చెందిన ఆవు మేతకు వెళుతున్న సమయంలో దారిలో వేటగాళ్ల పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆవును పశువైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పశువైద్యశాల కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Featured

ఫోటో ,వీడియో గ్రాఫర్ లకు జగనన్న చేయుత పథకం అందించాలి.

పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్లకు జగనన్న చేయూత పథకం అందించి ఆదుకోవాలని పలమనేర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు.రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వృత్తిరీత్యా, పనులు దొరక్క పస్తువులతో అల్లాడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకునేవారని వ్యాపారం లేక కుటుంబాలు వీధిన పడి, అలమటిస్తూ బాధలు చెప్పుకోలేక రాష్ట్రంలో ఇప్పటికీ 16 మంది ఫోటో ,వీడియో గ్రాఫర్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని కంటతడి పెట్టారు.ఈ కార్యక్రమంలో బాబు,మురళీ, దేవేంద్ర,సురేష్ బాబు,ధనంజనేయులు , రాఘవేంద్ర,పోటో & వీడియో,గ్రాఫర్లు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు వెంటనే ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు గత నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని ఎవరినీ తొలగించకుండా సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెల్లూరు జిల్లా మొత్తం సుమారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటు ఉపాధ్యాయులు సుమారు 30 వేలకు పైగానే ఉన్నారు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లు ఇప్పటికీ అరటి పండ్లు మరియు కూరగాయలు అమ్ముకునే దయనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఏ అవకాశం లేని టీచర్లు మొన్న అనంతపురంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో కేశవరావు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలను వెంటనే నివారించాలని టీచర్లకు మరియు సిబ్బంది కి నెలకి పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి అనంతరం కూడా ఎవరిని నిధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలి సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ల అందరికీ గుర్తింపు కార్డును వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని జిల్లా మొత్తం ఆందోళన చేస్తారని హెచ్చరించారు

Featured

పంట పొలాలపై గజరాజులు దాడులు

పలమనేరు జూన్28,2020(పున్నమి విలేకరి) పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని వెంగమవారిపల్లి గ్రామంలో రాత్రి రెండు ఏనుగులు రాజగోపాల్ అనే రైతు పంట పొలాలపై పడి తీవ్ర నష్టం పరిచాయి. ఒక ఎకరా పొలంలో బీర ,టమోటా పంటలను వేసి,మార్కెట్ కు తరలించే దశలలో ధ్వంసం చేసి, లక్ష రూపాయలు నష్టం వాటిల్లేటట్టు చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. తరుచుగా ఈ మధ్యకాలం ఏనుగులు వస్తూనే ఉన్నాయి,పోయిన వారం మేకలనాగిరెడ్డిపల్లిలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది,మండల కేంద్రంలోనే అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో సుమారు ఏడూ ఏనుగులు తిష్ట వేసుకొని అడవిలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

Featured

పోలీసులకు థర్మామీటర్ వితరణ

పలమనేరు, జూన్28,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం నేషనల్ ఏహ్యూమన్ రైట్స్ కరప్షన్ అండ్ ఎరడ్యుకేషన్ ఫోరమ్ జాతీయ ఉపాధ్యక్షుడు దండు రవి ఆదివారం గంగవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణఆచారికి ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్ వితరణ చేశారు. ఈ సందర్భంగా దండు రవి మాట్లాడుతూ… పోలీసులు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులకు తన వంతు సాయంగా ఇన్ ఫ్రారెడ్ థర్మామీటర్, శానిటైజర్ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు.

Featured

గ్రామంలో కరోనా పట్టించుకొని అధికారులు

నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని శనివారం నాడు వైద్యశాఖ అధికారులు తెలిపారు, ఈ విషయం తెలియగానే గ్రామంలో భయాందోళనలు.., కాని గ్రామరెవిన్యూ అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు … కనీసం గ్రామంలో ఇప్పటివరకు శానిటైజ్ చేయకపోవడం విడ్డూరం.

Featured జాతీయ అంతర్జాతీయ సక్సెస్ స్టోరీస్

చరిత్రకే పాఠాలు నేర్పిన నెల్లూరు పండితులు

జులై 1 యాధృచ్చికంగా ఇద్దరు దిగ్గజాలకు జన్మనిచ్చింది. ఒకరేమో నెల్లూరు జిల్లా నుంచి తమ తాతల కాలంలో తమిళనాడుకు వలస వెళ్లిన వారు. ఇంకోరేమో నెల్లూరులోనే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా తమిళనాడుకు వెళ్ళినవారు. ఇద్దరు పురావస్తు శాఖలోనే శాసన అధ్యయన విభాగంలో పనిచేసినవారే. చరిత్రకే పాఠాలు నేర్పి, సరికొత్త విధానాలు రూపొందించి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు పొందారు. భారతదేశ చరిత్ర నిర్మాణంలో వీరిద్దరి పాత్ర అసమానమైనది. జులై ఒకటి వి.వెంకయ్య, కృష్ణమాచార్యుల పుట్టినరోజు సందర్బంగా పున్నమి ప్రత్యేక కథనం…. భారతీయ చరిత్ర నిర్మాణంలో శాసనాలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. మిగతా ఆధారలకంటే ఖచ్చితమైన సమాచారాన్ని శాసనాలు మాత్రమే ఇస్తాయి. చరిత్రకు ప్రామాణికమైన మూలం మరియు మన గత చరిత్రను పునర్నిర్మించడానికి ఇవి నిచ్చెనలా పనిచేస్తాయి. ఇందులో లిఖిత శాసనాలు పోషించే పాత్ర అతి ముఖ్యమైనది. ముఖ్యంగా మన దేశంలో ఈ శాసనాలు ఏ సందు గొందుల్లో చూసిన ఉంటాయి. గ్రామాల సరిహద్దుల్లో, పాత దేవాలయాల్లో శాసనాలు విరివిగా కానవస్తాయి. ఈ శాసనాలను పరిరక్షించడానికి మరియు వాటిని అధ్యయనం చేయడానికి స్వాతంత్ర్యానికి ముందే భారతీయ పురావస్తుశాఖ ఏర్పడటంతో పాటు శాసన అధ్యయన విభాగం ప్రారంభమైంది. తెలుగుతో సహా మిగతా భాషల శాసన అధ్యయన విభాగం తమిళనాడులోని ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలోని పురావస్తు కార్యాలయంలో వుంది.                                                                                                   వి.వెంకయ్య పురావస్తు శాఖకు సంబంధించి మన తెలుగువారు అందులో ముఖ్యంగా మన నెల్లూరీయులు ఎంతోమంది భారతీయ చరిత్ర నిర్మాణంలో సేవ చేశారు. వారిలో రావు బహదూర్ వి. వెంకయ్య గారు ఒకరు. వీరి పూర్వీకులు నెల్లూరు నుంచి వలస వెళ్లారు. తిరువణ్ణామలై జిల్లాలోని వాళైయాత్తూర్ గ్రామంలో 1864 జులై ఒకటిన వెంకయ్య జన్మించారు. చదువు నిమిత్తం మద్రాసుకి వచ్చి మాంబళంలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత మద్రాస్ ఎపిగ్రఫీ (శాసన అధ్యయన శాఖ ) లో ఉద్యోగం సంపాదించి డాక్టర్ హుల్ట్జ్ దగ్గర శిష్యరికం చేశారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలోని శాసనాలు, పాండ్య దేశాలలోని పల్లవ దేవాలయాలను అధ్యయనం చేయడంలో వెంకయ్య ఒక మార్గదర్శక ప్రయత్నం చేశారు. ఎపిగ్రాఫియా ఇండికాకు విశేష కృషి చేశారు. తంజావూరులోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం యొక్క సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన శాసనాలను దక్షిణ భారత శాసనాలు వాల్యూమ్ 2 గా ప్రచురించారు . ఇది ప్రపంచంలోని పండితుల ప్రశంసలను పొందింది. ఈ శాసనాల ద్వారా విస్మయపరిచే విషయాలను ప్రపంచానికి తెలియపరచారు . ఆలయ గోడలపై చెక్కబడిన శాసనాల సంపదను నాశనం కాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. మరమ్మత్తులు, పునర్నిర్మాణం పేరిట ధ్వంసం చేయబడటాన్ని చాలావరకు నిలువరించారు. పునర్నిర్మాణం యొక్క వినాశకరమైన అభ్యాసాన్ని ఆపాలని వీరు ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్లను IV, V మరియు VIII లను సవరించారు. వివిధ పత్రికలలో అనేక వ్యాసాలను రాశారు.నెల్లూరు జిల్లా చరిత్రకు వీరు ఎనలేని సేవ చేశారు. వీరు ఏన్సియంట్ హిస్టరీ అఫ్ నెల్లూరు అనే వ్యాసాన్ని రాసారు. నెల్లూరు జిల్లాపై తనకున్న అభిమానంతో తరచు జిల్లాకు వచ్చేవారు. నెల్లూరు జిల్లాలో జైనుల ఉనికిని తెలియపరచి, ఇప్పుడున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రాంతం ఒక్కప్పుడు జైనుల స్థావరంగా తేల్చారు. సుందరమైన జైన విగ్రహాలు, ప్రాచీన జైన కోనేరు వెలికి తీయడంలో వీరి పాత్ర ఎంతో వుంది. దురదృష్టవశాత్తు 1912 లో 48 సంవత్సరాల వయస్సులోనే వెంకయ్య గారు మరణించారు.                                                                                                  సి. ఆర్. కృష్ణమాచార్యులు రావు బహదూర్ సి. ఆర్. కృష్ణమాచార్యులు నెల్లూరు జిల్లాలోని గంగవరం గ్రామంలో, వైష్ణవ కుటుంబంలో జూలై 1, 1888 న, జన్మించారు. కృష్ణమాచారి నెల్లూరులోని వి.ఆర్. హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ చేసి, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరారు. ఆ కళాశాలలో ఎఫ్. ఎ పూర్తి చేసిన తరువాత, మద్రాసులోని పచ్చయప్ప కళాశాల నుండి విశ్వవిద్యాలయ పట్టా పొందారు. నెల్లూరులోని ఎం. ఎస్. లోయర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించి తరువాత నెల్లూరు కలెక్టరేట్‌లో చేరారు. అక్కడ కొంతకాలం సేవలందించిన తరువాత, ఎపిగ్రాఫికల్ విభాగంలో చేరారు. హెచ్. కృష్ణ శాస్త్రితో కలిసి పనిచేసి, 1925 లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది 1931 లో సూపరింటెండెంట్ అయ్యారు. 1942 లో భారతదేశ ప్రభుత్వ ఎపిగ్రాఫిస్ట్ అయ్యారు, తన పదవీకాలంలో శాసన అధ్యయన శాఖను ఆధునిక పద్దతిలో ఆవిష్కరించారు. వందల శాసనాలను వెలికితీసారు. కృష్ణమాచార్యులు సంస్కృత మరియు తెలుగు భాషలలో ఉత్తమ పండితులు కావడంచేత దక్షిణ భారత భాషలలో అత్యుతమ ఎపిగ్రాఫిస్ట్ గా పేరు గడించారు. 1931 నుండి దక్షిణ భారత ఎపిగ్రఫీపై వార్షిక నివేదికలు రూపొందించడంలో, శాఖ సిబ్బందిని సమర్ధవంతంగా సమన్వయ పరచడంలో కృష్ణమాచార్యులు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు. పల్లవుల చరిత్రకు సంబంధించి ఖచ్చితమైన శాసన సామాగ్రిని వెలికితీసి పరిశోధన పండితులకు అందించారు. అనేక తామ్ర శాసనాలను భద్రపరిచారు. చాలా విలువైన పత్రాలను సేకరించారు. ఈ ఆవిష్కరణలన్నీ కృష్ణమాచార్యులు యొక్క ఘనతను సూచిస్తున్నాయి. రచనాపరంగా హైదరాబాద్ పురావస్తు సిరీస్ కోసం కన్నడ శాసనాలు, దక్షిణ భారత ఎపిగ్రఫీపై వార్షిక నివేదికకు విషయ సూచిక, శాసనం జాబితాలు, ఎపిగ్రాఫియా ఇండికాలో వ్యాసాలు. ఇలా అన్నిటిలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. పురావస్తు అన్వేషణలో, చరిత్రపూర్వ యుగపు ప్రదేశాలను గుర్తించడంలో నేర్పరితనం చూపారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశ శాసనాల పట్టిక, ఇండెక్స్, టోపోషీట్స్ లాంటి వినూత్నమైన పద్దతులను ఆవిష్కరించారు. ఈ విధానాలనే భారతీయ పురావస్తు శాఖ నేటికీ పాటిస్తుండడం కృష్ణమాచార్యుల యొక్క గొప్పతనమేనని చెప్పవచ్చు. పదవీ విరమణ తరువాత దక్షిణ భారతదేశంలో చరిత్ర పూర్వప్రదేశాల జాబితాను సిద్ధం చేసే క్రమంలో 1947 ఆగస్టు 31 న మద్రాసులో మరణించారు. కృష్ణమాచార్యుల మరణం భారతీయ ఎపిగ్రఫీకి తీరని లోటుగా పురావస్తు శాఖ పేర్కొంది. నెల్లూరు నుంచి కొంతమంది ఔత్సాహిక పరిశోధకులు అడిగిందే తడవుగా నేటి తెలుగు శాసన అధ్యయన విభాగ అధిపతులు, మన తెలుగువారు అయిన ఎం.యేసుబాబు గారి కృషితో పురావస్తు శాఖ తమ శాసన estampage విభాగానికి సి.ఆర్. కృష్ణమాచార్యుల భవనంగా నామకరణం చేసి వారు లేని లోటును తీర్చుకొని, వారికి ఘనమైన నివాళులర్పించారు.భారతీయ చరిత్రకు గట్టి పునాదులు వేసిన వెంకయ్య, కృష్ణమాచార్యులు తెలుగు వారు కావడం అందులో మన నెల్లూరీయులు కావడం మనం గర్వించదగ్గ విషయమైనప్పటికీ వారి సేవలను గుర్తించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ప్రజలు విఫలమయ్యారనే చెప్పవచ్చు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

భారత్ లో ఐదు లక్షలకు చేరిన కరోనా కేసులు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా జనవరి 30న మన దేశంలో ప్రవేశించి ఈరోజుకి(27-6-20 ఉదయం 10గంటలకు) 5 లక్షల పది వేల మందికి సోకింది . రోజు రోజుకీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. * మొదటి కేసు నమోదు అయినది జనవరి 30 . * మే 18 నాటికి లక్ష కేసులు. * జూన్ 6 నాటికి 18 రోజులలో లక్ష కేసులు 2 లక్షలు అయ్యాయి * జూన్ 11నాటికి 5 రోజులలో 2లక్షల కేసులు 3 లక్షలయ్యాయి. * జూన్ 20 నాటికి 9 రోజులలో ఈ 3లక్షలు 4 లక్షల కేసులు అయ్యాయి. * జూన్ 26 నాటికి 7 రోజులలో 4లక్షల కేసులు 5లక్షలకు చేరాయి. భవిష్యత్తులో సగం జనాభాకి సోకవచ్చనే అంచనాను ఊహించికోవడమే కష్టంగా వుంది. మందులు, వ్యాక్సిన్లు వచ్చేశాయని కరోనా నివారణ చర్యల్లో అలసత్వం చెయ్యవద్దు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సంవత్సరకాలం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ధైర్యంగా ఉందాం! నివారణ మార్గాలను ఆచరిద్దాం!! కరోనాను ఎదుర్కొందాం!!!

Featured

ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం ✍️✍️

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మాట్లాడుతూ మన విశ్వవిద్యాలయం ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎనో విజయాలు సాధించాము అని తెలిపారు.  ఈ సందర్బంగా పూర్వ ఉపకులపతులు మరియు రిజిస్ట్రార్ల కృషిని ప్రశంసించారు. మన పూర్వ ఉపకులపతి ఆచార్య సి ఆర్ విశ్వేశ్వరావు గారు విశ్వవిద్యాలనికి స్థల సేకరణ మరియు ఎంతో మందికి ఉద్యోగ కల్పన గాని మరియు తర్వాత వచ్చిన ఆచార్య జీ రాజా రమి రెడ్డి గారు కొత్త భవనాలు కట్టడానికి పూనుకోవటం మరియు ఎంతో మందికి అధ్యాపక అధ్యాపకేతర సిబందిని నియమించడంలో, ఆచార్య వీ వీరయ్య గారు కొత్త కోర్సులు తేవడంలో గాని ఎంతో కృషి చేసారు.మన విశ్వవిద్యాలయం తో పాటి స్థాపించిన ఇతర విశ్వవిద్యాలయాల కంటే మనం ఎంతో ముందు ఉన్నాము అని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి కొత్త కోర్సులు మొదలుపెడతామని, కొత్త భవనాలు కడతామని, విద్యార్థులకు ఇంకా ఎనో వసతులు కలిపిస్తామని తెలిపారు. మన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12 బి గుర్తింపు రావడం, మన కానవొకేషన్ కార్యక్రమానికి దేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మరియు మన రాష్ట్ర గవర్నర్ బిశ్వభుసం హరిచందన గారు హాజరు అవడం వంటి కార్యక్రమాలు మన విశ్వవిద్యాలయానికి ఎంతో ఖ్యాతిని తెచ్చాయి అని తెలిపారు. ఈ ఆవిర్భావదినోత్సవ సందర్బంగా కొత్తగా అధ్యాపకులకు మరియు అధ్యాపకేతర సిబందికి అవార్డు లు ప్రధానం చేసే సంస్కృతిని ప్రారరభించబోతున్నామని తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలం విగ్రహాన్ని ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు, రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ ఆవిర్బాహ్వ దినోత్సవం లో ఆధాపకులు, అధ్యాపకేతర సిబంది, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు పాలుగొన్నారు.  

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.