ఈస్ట్ రిడ్జ్ స్కూల్, బొమ్మూరు నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి Dr K. వెంకటేశ్వర రావు సూచనల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం — బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం మరియు సమాన అవకాశాల గురించి యువతలో లోతైన అవగాహన పెంపొందించడం. సమాజంలో బాలిక పుట్టుకపై ఉన్న వివక్షను తొలగించి, ప్రతి ఆడపిల్లకు గౌరవం, భద్రత మరియు ప్రేమ లభించేలా ప్రజల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన సందేశంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు టీనేజ్ ప్రెగ్నెన్సీ (Teenage Pregnancy) వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాల గురించి వివరంగా తెలియజేశారు. చిన్న వయస్సులో గర్భధారణ వల్ల యువతీ జీవితం ఎలా ప్రభావితం అవుతుందో, విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో వివరించారు. ఈ అంశంపై విద్యార్థులకు చట్టపరమైన సమాచారం కూడా అందించబడింది.
అదనంగా, PCPNDT చట్టం (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act, 1994) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించబడింది. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టంగా వివరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు సమాజంలో లింగ అసమానతకు దారితీస్తాయని, ఆడపిల్లల పట్ల వివక్షను పెంచుతాయని తెలియజేసి, ఇటువంటి చర్యలను అరికట్టడంలో ప్రతి పౌరుడూ బాధ్యత వహించాలనే పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో సమాజంలో బాలికల ప్రాధాన్యత గురించి ఒక ఆడపిల్ల కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎంతటి విలువైన ఆస్తో, ఆమె విద్య, ఆరోగ్యం మరియు భద్రత సమాజ ప్రగతికి ఎంత అవసరమో వివరిస్తూ ప్రేరణాత్మక ప్రసంగాలు చేయబడ్డాయి. బాలికలు చదువుకొని ఎదిగితే సమాజం బలపడుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులకు చైతన్యం కల్పించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో Dy. Demo NRPS సత్య కుమార్ , శ్రీనివాస్ ప్రసాద్, జోషప్ (హెల్త్ సూపర్వైజర్లు) పాల్గొన్నారు.


