బి. కొత్తకోటలో జర్నలిస్టులకు కేటాయించిన 239 సర్వే నెంబర్ లో కొంతమంది బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారని జర్నలిస్టులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ భావజాన్ మాట్లాడుతూ, 239 సర్వే నెంబర్ లో 1.15 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి అని, దీనిలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఈ సర్వే నెంబర్ పై కొందరు అక్రమంగా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారని, వాటిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామని ఆయన పేర్కొన్నారు.

బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారు
బి. కొత్తకోటలో జర్నలిస్టులకు కేటాయించిన 239 సర్వే నెంబర్ లో కొంతమంది బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారని జర్నలిస్టులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ భావజాన్ మాట్లాడుతూ, 239 సర్వే నెంబర్ లో 1.15 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి అని, దీనిలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఈ సర్వే నెంబర్ పై కొందరు అక్రమంగా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారని, వాటిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామని ఆయన పేర్కొన్నారు.

