పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి):పబ్జీ గేమ్ అడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు సీఐ శ్రీధర్ కథనం మేరకు… పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరవకపోవడంతో ఇంట్లో స్మార్ట్ఫోన్లో నిత్యం పుబ్జి తదితర గేమ్స్ ఆడుతుండడం తో తల్లి మందలించింది.దీంతో శ్యామ్ శ్రీధర్ ఇంట్లోని ఒక గది లోకి వెళ్లి తల్లి చున్నీతో ఫ్యాన్ కొక్కికి ఉరి వేసుకున్నాడు. బిడ్డ కనిపించకపోవడంతో గదిలో చూడగా ఉరేసుకుని వేలాడుతున్న బిడ్డను చూసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లారు,పరిస్థితి విషమంగా ఉండడంతో బాలున్ని చిత్తూరు ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రెఫర్ చేశారు,అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్
పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి):పబ్జీ గేమ్ అడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు సీఐ శ్రీధర్ కథనం మేరకు… పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరవకపోవడంతో ఇంట్లో స్మార్ట్ఫోన్లో నిత్యం పుబ్జి తదితర గేమ్స్ ఆడుతుండడం తో తల్లి మందలించింది.దీంతో శ్యామ్ శ్రీధర్ ఇంట్లోని ఒక గది లోకి వెళ్లి తల్లి చున్నీతో ఫ్యాన్ కొక్కికి ఉరి వేసుకున్నాడు. బిడ్డ కనిపించకపోవడంతో గదిలో చూడగా ఉరేసుకుని వేలాడుతున్న బిడ్డను చూసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లారు,పరిస్థితి విషమంగా ఉండడంతో బాలున్ని చిత్తూరు ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రెఫర్ చేశారు,అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

