పున్నమి న్యూస్ ప్రతినిధి ఈశ్వరయ్య ఆగస్టు 02
సిద్ధవటం మండలం, ములపల్లె గ్రామంలో “కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సిద్ధవటం పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికీ (డోర్ టు డోర్) తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో భాగంగా, కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరిందని ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి సంతోషంతో చెబుతున్నారని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లొ పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి, sc సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, బూత్ కన్వీనర్ మురళి, కోకన్వీనర్ రమణ రెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



