ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంప్లో ఉన్న నూతన శివాలయం ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్బు సిన్హా ధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులతో మనోజ్ సిన్హా కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.



