మహారాష్ట్రలోని కళ్యాణ్-డొంబివిలి మున్సిపల్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేష్ మ్హాత్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరగా, ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు, నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. దాడికి గురైన డాక్టర్ వైభవ్ సలుంఖే, డాక్టర్ సృష్టి బవిస్కర్ తీవ్ర మనోవేదనతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నవజాత శిశువును మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో ఆగ్రహించిన బంధువులు కార్పొరేటర్ను పిలిపించగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్.. ఇద్దరు వైద్యుల రాజీనామా
మహారాష్ట్రలోని కళ్యాణ్-డొంబివిలి మున్సిపల్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేష్ మ్హాత్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరగా, ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు, నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. దాడికి గురైన డాక్టర్ వైభవ్ సలుంఖే, డాక్టర్ సృష్టి బవిస్కర్ తీవ్ర మనోవేదనతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నవజాత శిశువును మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో ఆగ్రహించిన బంధువులు కార్పొరేటర్ను పిలిపించగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

