వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దువ్వూరు మునిశేఖర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని నెల్లూరు జిల్లా పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు అంకినపల్లి నరసింహారెడ్డి పేర్కొన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, అందరినీ ముందుండి నడిపిస్తూ పబ్లిసిటీ విభాగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన మాటతీరు, నాయకత్వం, కృషి ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మునిశేఖర్ రెడ్డి మృతి వైసీపీకి తీరని లోటు : అంకినపల్లి నరసింహారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దువ్వూరు మునిశేఖర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని నెల్లూరు జిల్లా పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు అంకినపల్లి నరసింహారెడ్డి పేర్కొన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, అందరినీ ముందుండి నడిపిస్తూ పబ్లిసిటీ విభాగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన మాటతీరు, నాయకత్వం, కృషి ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

