పున్నమి న్యూస్ డి హరికృష్ణ జూలై 21 (చిల్లకూరు)
నిరుపేదలైన మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ శ్రీయుతనందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ తెలిపారు.
మంగళవారం చిల్లకూరు మండలం వడ్డీకండిగా గ్రామంలో నిరుపేద మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు.
అనంతరం గ్రామంలోని మహిళలకు చిన్నారులకు ఈ వేసవి కాలంలో వచ్చే చికెన్ ఫాక్స్ అమ్మవారు లాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులను పంపిణీ చేశారు.
ఎంవి రావు ఫౌండేషన్ ప్రతిరోజు గూడూరు నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో తమకు తోచిన విధంగా నిరుపేదలకు చేయూతనందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లీలా మోహన్ కృష్ణ విజయలక్ష్మి అంగనవాడి కార్యకర్తలు గ్రామం మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.



